ACE Engineering College a Center for honing Talent and Learn Employable Skills
ఏస్ ఇంజనీరింగ్ కళాశాల – ప్రతిభ, మెలకువల అభివృద్ధికి కేంద్రం
For Admissions enquire:
ACE Engineering College a Center for honing Talent and Learn Employable Skills
ఏస్ ఇంజనీరింగ్ కళాశాల – ప్రతిభ, మెలకువల అభివృద్ధికి కేంద్రం
ప్రస్తుత కోవిడ్ మహమ్మారి విద్యా వ్యవస్థను చాలా ఎక్కువగా నష్టపరిచింది. విద్యార్థులకు సక్రమంగా భోదన జరపనీయకుండా నెలల తరబడి ప్రత్యక్ష తరగతులకు దూరం కావడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురైయ్యారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఏస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యా భోదనలో తన నిబద్ధతను నిరూపించుకుని విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా విద్యా బోధన చెయ్యడమే కాక ఉద్యోగ నియామకాలకు కావలసిన శిక్షణ నిరంతరం కొనసాగించి అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను కల్పించిన ఘనతను సాధించింది.
ప్రయోగ తరగతులను కూడా యూనివర్సిటీ విధించిన సమయ పరిమితిలో పూర్తి చేసి విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చింది.
ప్రతేక్యంగా విద్యార్థులకు ఉద్యోగ కల్పనకు ఉద్దేశించి ప్రత్యేక శిక్షణా కార్యక్రమం “బట్టర్ ఫ్లై” అనే పేరుతొ విద్యార్థులను వారి ప్రధమ సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాలు పాటు నిరంతరంగా తరగతులను నిర్వహించడం వల్ల ప్రస్తుత నాలుగవ సంవత్సరం విద్యార్థులు కోవిడ్ కాల పరిస్థితులలో కూడా ఆన్లైన్ తరగతులకు విశేష సంఖ్యలో హాజరు అయ్యి ఉద్యోగ శిక్షణా తరగతులను కూడా ఆన్లైన్ లోనే అందుకుని అధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించగలగడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
కళాశాల ప్రాంగణములో ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతి గదులు, సెమినార్ హాల్, ఆధునిక కంప్యూటర్ ప్రయోగ శాలలు ప్రత్యేకంగా ఉద్యోగ పోటీ పరీక్షలలో విజయ సాధనకు అవసరం అయిన కేంద్రీకృత శిక్షణా తరగతులు అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది క్రమం తప్పకుండా శిక్షణ నిర్వహించడం వల్ల విద్యార్థులు కోడింగ్ లోను కమ్యూనికేషన్ లోను ప్రవర్తన రీతులలోను మంచి శిక్షణ పొందారు. వీటితోపాటు విద్యార్థులు వారి బి.టెక్ విద్యలో ప్రమాణాలు నిలుపుకుంటూ ఉద్యోగాలకు కావలసిన అన్ని విషయాలలో నిష్ణాతులుగా తయారుకావడం వెనుక భోదనా సిబ్బంది నిరంతర కృషి, ప్లేసెమెంట్ విభాగంవారి కృషి, ఆధునిక సదుపాయాలు వల్ల 400 కు పైగా ఉద్యోగాల కల్పనకు ఎంతో తోడ్పడ్డాయి. ప్రతిష్టాత్మక కంపెనీలైన TCS డిజిటల్, TCS CODEVITA, TCS NINJA, TCS NPT, Cisco Systems, “Wipro” National Talent Test, Accenture, CAPGEMINI, Hitachi, వంటి ప్రతిష్టాత్మక కంపెనీలలో గరిష్టంగా 11 లక్షలు రూపాయలు వేతనంతో ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు. వీటితోపాటు విద్యార్థులకు జీతంతో కూడిన ఇంటర్న్షిప్ లను CISCO వంటి ప్రతిష్టాత్మక కంపెనీలలో కళాశాల విద్యార్థులు సాధించారు.
ప్రస్తుతం “ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్”, “మెషిన్ లెర్నింగ్” “డేటా సైన్స్”, “ఇంటర్నెట్ అఫ్ థింగ్స్” వంటి అధునాతన టెక్నాలజీలు సాఫ్ట్వేర్ కంపెనీల పనితీరు వాటి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ కోర్సులలో కూడా విద్యార్థులకు బి.టెక్ విద్యను ఏస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభించారు. ప్రస్తుతం చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులకు కొన్ని కోర్సులలో ప్రత్యేక శిక్షణను నిపుణులతో ఇప్పించడం జరుగుతోంది. ఈ కోర్సులకు అవసరం అయిన కంప్యూటర్ ప్రయోగశాలలు సిద్ధంచేసి అందుబాటులో ఉంచారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో ఈ కోర్సులకు సంభందించిన నిపుణుల అవసరం ఎంతో ఉంది. ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రంగంలోనే అధికంగా లభ్యమవుతాయి. అందుకుగాను కళాశాల యాజమాన్యం తగిన ప్రణాళికలు సిద్ధం చేసింది. బి.టెక్ విద్యా బోధనతో పాటు ఉద్యోగాలు సాధించడానికి కావలసిన ప్రత్యేక నిపుణతలు, సామర్ధ్యాలు అయిన కోడింగ్ స్కిల్స్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ద్వారా అందిస్తున్నారు. దీని కొరకు BYTEXL అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
విద్యార్థులతోను ఈ కొత్త కోర్సులలో ప్రాజెక్టులు చేయిస్తున్నారు, వివిధ కంపెనీలతో అవగహన ఒప్పందాలు కుదుర్చుకొని ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. JNTUH వారి JHUB తో ఒప్పందం కుదుర్చుకొని HACKATHON వంటి కార్యక్రమాలు కళాశాలలో నిర్వహించడం ద్వార విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ACE ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ స్థాయిని పది సంవత్సరాలకు గాను సాధించడం వల్ల ఈ రకమైన ప్రత్యేక శిక్షణను అందించడం మరింతగా అనుకూలిస్తోంది. దీని వల్ల విద్యార్థులకు ఈ నూతన కోర్సులపై పూర్తి అవగాహన లోతైన పరిజ్ఙానం కలుగుతుంది. విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
అత్యాధునిక టెక్నాలిజీలతో అధ్యాపకుల నైపుణ్యాల మెరుగు కొరకు ICT Academy అనే సంస్థ తో ఒప్పందం కుదుర్చుకొని అధ్యాపకుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దీని ద్వారా HUAWEI , మైక్రోసాఫ్ట్, DXC, వంటి సంస్థల ఉత్పత్తులతో అధ్యాపకులకు విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్యతను నేర్పించడం ద్వారా విద్యార్థుల ఉద్యోగ సంసిద్ధతకు తోడ్పడుతున్నది. క్రమం తప్పకుండా విద్యార్థులకు ఉద్యోగ సాధనకు సంబందించిన అవగాహన సదస్సులు, పునశ్చరణ సదస్సులు, శిక్షణా శిబిరాలు కొనసాగించడం ACE లో ఒక నిరంతర ప్రక్రియ.
విద్యార్థులకు నైపుణ్యత పెంపొందించే తరగతులు వారి పరిజ్ఞానం పరీక్షించే పోటీలు వారి వ్యక్తిగత అభివృద్ధికి అవసరమైన శిక్షణ సూచనలు కౌన్సెలింగులు నిష్ణాతులైన అధ్యాపక సిబ్బంది ద్వారా ఇస్తున్నారు.
ఇంక్యూబేషన్ సెంటర్:-
విద్యార్థులను కేవలం ఉద్యోగార్థులుగా మాత్రమే తయారుచేయకుండా కొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన MSME వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని కళాశాలలో ఇంక్యూబేషన్ సెంటర్లను ప్రారంభించారు. విద్యార్థులను వ్యాపారవేత్తలుగా, పారిశ్రామకవేత్తలుగా తీర్చిదిద్దడానికి అంకురాలుగా ఈ ఇంక్యూబేషన్ సెంటర్లు పనికి వస్తాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు.
కళాశాలలో ఆధునిక సదుపాయాలు అయిన డిజిటల్ క్లాసురూములు ఏర్పాటు చెయ్యడం విద్యార్థులను అధ్యాపకులను పరిశోధన రంగంలో ప్రోత్సహించడానికి పేరెన్నికగన్న “Microsoft Big Data” వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని అనుసంధానపరచి నిరంతరము శిక్షణ ఇస్తున్నారు. కళాశాల ప్రాంగణంలో అధునాతన హంగులతో విద్యార్థులకు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోడానికి ఓపెన్ జిమ్ (OPEN GYM) ఏర్పాటుచేశారు. ప్రత్యేకముగా 7 ఎకరాలు స్థలంలో క్రీడా మైదానాలు సిద్ధం చేసి క్రీడలలో శిక్షణ ఇస్తున్నారు.
బాలురకు, బాలికలకు ప్రత్యేకముగా అన్ని సదుపాయాలతో 250 మందికి సరిపడా కొత్తగా ప్రత్యేకమైన హాస్టల్ ప్రాంగణాలు నిర్మించి అందుబాటులో ఉంచారు. సువిశాలమైన కాంటీన్ ఆధునిక యంత్రాలతో సదుపాయాలతో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.
సెమినార్లు, శిక్షణా తరగతులు, ఉద్యోగానియమాకాలు సదస్సులు, మేళాలు , సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా 1000 మంది కూర్చోడానికి వీలైన, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ చేయబడిన, అత్యాధునిక సదుపాయాలతో ఆడిటోరియం ను విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించారు. కళాశాలకు సంబందించిన అన్ని కార్యక్రమములు నిర్వహించుకోడానికి వీలుగా కళాశాల ఆవరణలో అందుబాటులో ఉంది.
సాధారణంగా ఏ కళాశాలలోనైనా వారి ఆఖరి విద్యా సవత్సరంలోనో మూడవ సంవత్సరం చదువుతున్నపుడో ఉద్యోగానియమాకాలు సాధిస్తారు కానీ ACE Engineering కళాశాలలో 2020-21 వ సంవత్సరంలో COMPUTER SCIENCE ENGINEERING – ARTIFICIAL INTELEGENCE AND MACHINE LEARNING BRANCH చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు వారి మొదటి సంవత్సరం పూర్తీ కాకుండానే ఏడుగురు విద్యార్థిని లను GOOGLE సంస్థ లో “WOMEN ENGINEER” గా ఎంపిక అయ్యారు. వీరు ప్రతినెలా కంపెనీ నుండి స్టయిఫండ్ పొందుతూ నాలుగు సంవత్సరాలు చదువు పూర్తయ్యాక మంచి జీతభత్యాలు తో ఉద్యోగాలు సాధించడానికి వీలుపడుతుంది.
ఈ ఘనత సాధించడానికి కళాశాలలోని ప్లేసెమెంట్ డిపార్ట్మెంట్ వారి కృషి ఎంతో ఉంది.
ప్రతిభావంతులైన విద్యార్థులను పారిశ్రామిక రంగానికి నిపుణులైన, సమర్థులైన ఇంజినీర్లను తయారుచేయాలనే లక్ష్యముతో 2007 వ సంవత్సరంలో ACE ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించబడినది. గత 11 సంవత్సరాలుగా ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ ఉన్నత ఫలితాలను సాధిస్తూ భవిషత్తులో అవసరమైన బ్రాంచీలలో కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ ప్రస్థానం సాగిస్తున్నది. అర్హత ఉన్న EEE, ECE, CSE, CIVIL, MECHANICAL కోర్సులకు NBA గుర్తింపును కళాశాలకు NAAC గుర్తింపు “A” స్థాయి సాధించడమే కాక UGC వారి నుండి స్వయంప్రతిపత్తి (Autonomous) ని కూడా 2020-21 సంవత్సరం నుండి 2020-2030 వ సంవత్సరం వరకు పది సంవత్సరాల కాలానికి సాధించింది.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇంజనీరింగ్ విధ్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థలలో ఎం.టెక్ కోర్సులలో ప్రవేశానికి ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు సాధించడానికి అర్హత పరీక్ష అయిన గేట్ (GATE) పరీక్షల్లో అల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 57 సార్లు సాధించిన ఘనత కలిగి గత 25 సంవత్సరాలుగా మొదటి 50 ర్యాంకులను స్థిరంగా సాధిస్తున్న ప్రతిష్టాత్మక శిక్షణా సంస్థ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ని స్థాపించి నిర్వహిస్తున్న జాతీయ స్థాయి విద్యావేత్త ప్రొఫెసర్ వై.వి. గోపాలకృష్ణ మూర్తి గారు ఏస్ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారు. అయన పర్యవేక్షణలో సుశిక్షుతులైన, నిష్ణాతులైన అధ్యాపక బృందం ఏస్ ఇంజనీరింగ్ కళాశాల లో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ ఆధునిక విద్యా వసతులన్నిటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.
నగర శివార్లలో ఉన్న ఘట్కేసర్ ప్రాంతంలో ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నత ప్రమాణాలకు ఉత్తమ విద్యా సంస్థగా పేరు తెచ్చుకున్నది. కళాశాల వ్యవస్థాపకులైన ప్రొఫెసర్ వై.వి. గోపాల కృష్ణ మూర్తి గారు నిరంతరం కృషి అయన అధ్యాపక సిబ్బంది బృందం నిబద్దత విద్యార్థులకు, సమాజానికి ఒక వరంగా అభివర్ణించి వచ్చును.